కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..ముగ్గురు మృతి
ఓబులవారిపల్లె: కడప జిల్లా ఓబులవారిపల్లెలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భార్య, భర్త కుమారుడు ఉన్నారు. కుమార్తెకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పుల్లంపేట మండలం దండ్లోపల్లె వాసులుగా గుర్తించారు. వారు కువైట్కు వెళ్లి తిరిగి వస్తూ చెన్నై నుంచి పుల్లంపేట కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/