ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానం – రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..సీఎం కేసీఆర్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానమని , కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని , అందుకోసమే పార్టీల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

దేశంలోని రాజకీయాలను కార్పొరేట్ రాజకీయాలుగా చేశారని , సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీలను ఎన్నికల నిర్వహణకు, ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు లేవని.. కాబట్టి మీకు కావల్సిన వేల కోట్ల రూపాయలను నేను సమకూరుస్తాను.. నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అంటూ సీఎం కేసీఆర్.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో బేర సారాలు మొదలు పెట్టారన్నారు. కేసీఆర్ భూదోపిడీని ఓ టీవీ సీరియల్ లాగా బయటపెడతానని తెలిపారు. రేపు యశోద హాస్పిటల్స్ కు భూకేటాయింపుల్లో దోపిడీ కోణం ఎపిసోడ్ బయటపెడతానని వెల్లడించారు. కరోనా చికిత్స ఔషధం రెమ్ డెసివిర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.