కుమారి ఆంటీకి తీపి కబురు అందించిన సీఎం రేవంత్

కుమారి ఆంటీ..ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీగా సోషల్ మీడియా ఆమెకు నామకరణం చేసి వైరల్ చేసింది. నిజానికి ఆమెకు సంబంధించిన వీడియోలు గత రెండు మూడేళ్ల నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్ ఫామ్స్ లో తిరుగుతూనే ఉన్నాయి. అయితే మీ బిల్లు రూ.1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా తిన్నారు కదా అని పేర్కొన్న వీడియో వైరల్ కాగా దానిని ట్రోలింగ్ చేస్తూ వీడియో చేయడంతో ఆమె మళ్లీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది.

అంతే సినీ ప్రముఖులు సైతం కుమారి ఆంటీ దగ్గరికి రావడం , భోజనం చేసి వెళ్లడం మొదలుపెట్టారు. ఇక యూట్యూబర్లు ఆగుతారా..ప్రతి రోజు వందలమంది వీడియోస్ కవర్ చేస్తూ మరింత వైరల్ చేసారు. దీంతో ఆ రోడ్ అంత ఫుల్ ట్రాఫిక్ జాం గా మారింది. ఈ క్రమంలో నిన్న ట్రాఫిక్ పోలీసులు..హోటల్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని చెప్పి క్లోజ్ చేయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడం తో..దీనిపై సీఎం రేవంత్ స్పందించి..కుమారి ఆంటీ హోటల్ జోలికి ఎవ్వరు వెళ్లోద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేసారు. ఈ నిర్ణయం పట్ల కుమారి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ..రేవంత్ కు థాంక్స్ చెప్పుకుంది.