ఆర్థిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బ‌హుమ‌తి

research-on-financial-crises-nobel-for-three-economists

స్టాక్‌హోమ్‌: ఆర్థిక శాస్త్రంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నోబెల్ పుర‌స్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్త‌ల‌కు ద‌క్కింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తిని అమెరికాకు చెందిన బెన్ ఎస్ బెర్నాంకే, డ‌గ్ల‌స్ డబ్ల్యూ డైమండ్‌, ఫిలిప్ హెచ్‌. డిబ్‌విగ్‌ల‌కు అందించ‌నున్న‌ట్లు అకాడెమీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల‌కు గాను వీరిని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక చేసిన‌ట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/