రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ వస్తున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది.

జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు జనసేన ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించిన బొంతు రాజేశ్వరరావు.. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యారు. అనంతరం కేడర్‌తో చర్చలు జరిపిన ఆయన జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనకు గుడ్ బై చెప్పి రేపు జగన్ సమక్షంలో కాకినాడలో సొంత గూటికి బొంతు రాజేశ్వరరావు చేరునున్నారు.