ఎపిలో మే 16 నుంచి పాఠశాలలకు వేసవి శెలవులు
జూలై1 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం

Amaravati: రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఈ ఏడాది మే 16నుంచి జూన్ 30వ తేదీ వేసవి శెలవులు ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
జూలై 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు.. కాగా ఈ ఏడాది మే 15వ తేదీతో 1 నుంచి 9 తరగతుల వరకు విద్యాసంవత్సరం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/