బాబాయ్ కి రక్షణగా రామ్ చరణ్..?

గత మూడు రోజులుగా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఇంటివద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని స్వయంగా జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా తెలుపడం..దానికి సంబదించిన సిసి ఫుటేజ్ బయటపెట్టేసరికి అంత షాక్ లో పడ్డారు. పవన్ కళ్యాణ్ కు ఏమైనా జరిగితే అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అభిమానులు , కార్య కర్తలు పెద్ద ఎత్తున పవన్ ఇంటికి చేరుకుంటున్నారు. మరోపక్క అభిమానులు కేంద్రాన్ని పవన్ కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ సైతం కాస్త ఖంగారు పడుతున్నారు.

ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే రామ్ చరణ్ ఏకంగా తన బాబాయ్ కోసం స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. చరణ్ అమితంగా పేమించే పవన్ కళ్యాణ్‌ని ఎవరో ఏదో చేస్తారని తెలియగానే తనే స్వయంగా పవన్ రక్షణ వ్యవహారాలను చూసుకుంటున్నారట. తన ప్రైవేటు బాడీ గార్డులను కూడా పవన్ కళ్యాణ్ కోసమే కేటాయించారట రామ్ చరణ్. మరి ఇందులో ఎంత నిజం ఉందొ కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.

ఇక ఇదిలా ఉంటె పవన్ ఇంటి వద్ద రెక్కీ ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్ద రెక్కి చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనిపై విచారణ చేయాలని కోరారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుంటే.. కేంద్రమే రంగంలోకి దిగుతుందని స్పష్టం చేశారు.