అసెంబ్లీ సమావేశాలు..నేటితో ముగియనున్న పద్దులపై చర్చ

telangana-assembly

హైదరబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్‌, రవాణాశాఖ, గవర్నర్‌-మంత్రిమండలి పద్దులపై చర్చించనున్నారు. వీటితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపైనా చర్చజరుగనుంది.

ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల ఉత్పత్తి, ఎస్‌ఆర్డీపీ, మెట్రో రైలు పొడిగింపు, పాల ఉత్పత్తి, నీరా కేఫ్‌, చెక్‌ డ్యాంల నిర్మాణం, క్రీడా మైదానాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.