కార్తీక మాసం సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్ ..

ప్రయాణికులకే కాదు భక్తులకు కూడా TSRTC బంపర్ ఆఫర్లు ఇస్తుంటుంది. పెద్ద పండగలు వచ్చినప్పుడు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రత్యేక బస్సులు లు ఏర్పటు చేయడం, వారి గమ్యస్థానానికి చేర్చడం వంటివి చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రస్తుతం కార్తీక మాసం సందర్బంగా భక్తులకు మరో ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ ఛార్జీతో 5 ప్రముఖ ఆలయాల సందర్శనకు కార్తీకమాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది.

ఈ ఆఫర్ కింద ఉదయం 7గంటలకు సికింద్రాబాద్‌ గురుద్వార వద్ద బస్సులు ప్రారంభమై అలియాబాద్‌ (రత్నాలయం), వర్గల్‌ (మహసరస్వతి), కోమర వెల్లి (మల్లన్నస్వామి), కీసరగుట్ట (రామలింగేశ్వర స్వామి),చీర్యాల (లక్ష్మి నర్సింహ స్వామి) ఆలయాల దర్శనం అనంతరం తిరిగి గురుద్వార వద్దకు బస్సుుల చేరుకుంటాయని సికింద్రాబాద్ డీవీఎం అపర్ణకల్యాణి తెలిపారు. టికెట్ చార్జీలు పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.300 ఉంటుందని అన్నారు. ఆలయాల్లో దర్శనం, భోజన ఖర్చులు ప్రయాణీకులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కొరకు 7382839566 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని అన్నారు.