పంజాగుట్ట లో రాకేశ్ మాస్టర్ భార్య ఫై దాడి

పంజాగుట్ట లో రాకేష్ మాస్టర్ భార్య లక్షి ఫై నలుగురు మహిళలు దాడి చేసారు. రీసెంట్ గా రాకేష్ మాస్టర్ అనారోగ్యం తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణం సోషల్ మీడియా ఫాలోయర్స్ ను , డాన్సర్లను దిగ్బ్రాంతి కి గురి చేసింది. ఇదిలా ఉంటె రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు దాడి చేసారు. తన స్కూటర్‌పై వెళుతుండగా లల్లీ అనే యూట్యూబర్ తో పాటు మరో నలుగురు మహిళలు..లక్ష్మి ఫై దాడి చేసారు. ఈ దాడి ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని లక్ష్మి ని స్టేషన్ ను తీసుకెళ్లారు.

తనపై దాడి చేసిన వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత లల్లీ, ఆ నలుగురు మహిళలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తొలుత లక్ష్మియే తమను దూషించిందంటూ సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు వాళ్లను పంపించేశారు. యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వీళ్లందరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరుకు చెందిన భారతే ఇదంతా చేసిందని లక్ష్మి ఆరోపించింది. తనకు రెండు నెలలుగా చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. లల్లీకి భారతి డబ్బులు ఇచ్చి తనపై ఉసిగొల్పిందని పేర్కొంది. తన యూట్యూబ్ ఛానల్ మూసుకోవాలని వీరు బెదిరిస్తున్నారు ఆరోపించారు. ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు.