నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్ర..

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసింది. లోకల్ నేతలే కాకుండా జాతీయ నేతలను సైతం రంగంలోకి దింపి ప్రచారం చేస్తుంది. నిన్న కొల్లాపూర్ లో రాహుల్ పాల్గొనగా..నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.

ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి రానున్నారు. కల్వకుర్తిలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం నాలుగు గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌లో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ కూడలి వరకు పాదయాత్ర చేస్తారు. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు.