ఉత్త‌రాఖండ్ నూత‌న సీఎం గా పుష్క‌ర్‌సింగ్ ధామి

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ నూతన సీఎం గా పుష్క‌ర్‌సింగ్ ధామి ఎన్నిక‌య్యారు. ఈ మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు ఉత్త‌రాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్ట‌ర్స్‌లో బీజేపీ శాస‌నస‌భాప‌క్షం స‌మావేశ‌మై ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర‌మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, ఇత‌ర సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుల స‌మ‌క్షంలో ఉత్త‌రాఖండ్‌ బీజేఎల్పీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా క‌లిసి త‌మ కొత్త నాయ‌కుడిగా పుష్క‌ర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు. బీజేఎల్పీ నేత‌గా పుష్క‌ర్‌సింగ్ ధామి ఎన్నిక కావ‌డంతో ఇక ఆయ‌న ఉత్త‌రాఖండ్‌ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని లాంఛ‌న‌మే కానుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/