సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ కు నిరసన సెగ

protest-against-minister-ktr-in-sircilla

రాజన్న సిరిసిల్ల: మంత్రి కెటిఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ​చేశారు. ‘మంత్రి కెటిఆర్.. మీ రాజకీయ పర్యటనలు.. పబ్బం గడుపుకునే రాజకీయాలు బంద్ చేయండి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఓదార్చే కార్యక్రమాలు పెట్టుకోండి. మమ్ములను ఆదుకోకపోతే విషం తాగి చస్తం. ఒక వైపు రైతులు అరిగొస పడుతుంటే మీ రాజకీయ పర్యటనలు అవసరమా? మమ్ములను ఓట్లు అడగడానికి ఎలా మా గ్రామానికి వస్తారు’అంటూ కెటిఆర్​ను నిలదీశారు.

మరోవైపు ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో పంట నష్టం పరిశీలనకు వెళ్తున్న కెటిఆర్​కాన్వాయ్​ని కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ కార్పొరేటర్ గడుగు రోహిత్ పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్ కు తరలించారు.