నేడు అనంతపురం జిల్లా పర్యటనకు రానున్న రాష్ట్రపతి

నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం

president-of-india-droupadi-murmu-visiting-puttaparthi

న్యూఢిల్లీః భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఈ సందర్భంగా 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. కాగా సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌లో ప్రతి ఏడాది సత్యసాయి బాబా పుట్టినరోజుకు ఒక రోజు ముందు స్నాతకోత్సవం జరుగుతుంది. సత్యసాయి 98వ జయంతికి ముందురోజైన ఇవాళ 42వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు.