నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి రాష్ట్ర పర్యటన ఇదేనని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకు ముర్ము అక్కడే ఉంటారు. సోమవారం మైసూరులో దసరా ఉత్సవాలను ప్రెసిడెంట్ ప్రారంభిస్తారు. హుబ్లీ ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం బెంగళూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ల తయారీ ప్లాంట్ను ఓపెన్ చేస్తారు. బెంగళూరులో ఆమె గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. తర్వాత 28న ఢిల్లీకి తిరిగి వస్తారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/