పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

బాపు బొమ్మ ప్రణీత..శుక్రవారం రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత.. అతి తక్కువ టైంలోనే హిందీలో ప్రవేశించి అజయ్ దేవగన్‌తో కలిసి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాన్ కిత్తన్ సినిమాలో నటిస్తున్నది. అయితే తాజాగా ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకొన్నారు.

కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగానే అభిమానులకు షాకిచ్చి పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది. 2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను ఈమె పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా తాను తల్లి కాబోతున్నానని అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్తను అందించింది తాజాగా జరిగిన శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఇక జూన్ 10వ తేదీన తాను పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చనినట్టు తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మాకు ఆడపిల్ల జన్మించింది. మా ఇంటిలోకి చిన్నారి రాకతో కొద్ది రోజులుగా మా ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాం. గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ మాకు ఇచ్చి సహకారం మరువలేనిది. భావోద్వేగమైన సమయాల్లో ఇచ్చిన మానసిక స్థైర్యం మాటల్లో చెప్పలేను. డాక్టర్ సునీల్ ఇశ్వార్ బృందం ఉండటంతో నా డెలీవరీ చాలా స్మూత్‌గా జరిగిపోయింది. అనెస్తీషియన్ టీమ్ వల్ల నొప్పి లేకుండా నాకు ప్రసవం జరిగిపోయింది. అప్పటి నుంచి నా బిడ్డను మీకు పరిచయం చేయాలని ఎమోషనల్ అవుతున్నాను అని ప్రణీత తన పోస్టులో తెలిపింది.