రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరిన జనసేనాధినేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీలో శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు కొద్దీ సేపటి క్రితం చేసుకున్నారు. రోడ్డు మార్గాన సభ వేదిక దగ్గరికి బయలుదేరారు. అయితే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని జనసేన నేతలు చెపుతున్నారు. ఈ క్రమంలో సభ చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేసారు. భారీ గేట్లు ఏర్పటు చేసి లోనికి ఎవ్వర్నీ అనుమతి ఇవ్వడం లేదు. ఎక్కడిక్కడే జనసేన నాయకులను గృహనిర్భందం చేసారు.

అలాగే పవన్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. హుకుంపేట-రైల్వేస్టేషన్ మధ్య రోడ్డుపై గుంతలు పూడ్చడానికి జనసేన తరలించిన మిక్సర్ వాహనాలను అడ్డుకున్నారు పోలీసులు. ఇక బాలాజీపేట వద్ద కుర్చీలు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ప్రసంగించే బస్ ఒక్కటే అక్కడ ప్రత్యక్షం అవుతుండగా దాని చుట్టూ పోలీసులు మొహరించారు.