ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్

శ్వాసకోస పనితీరులో సానుకూల ఫలితాలు..ఆర్మీ ఆసుపత్రి

Ex-President Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన శ్వాసకోస పనితీరులో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆర్మీ ఆసుపత్రి తెలిపింది. ప్రణబ్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె వంటి కీలక అవయవాల పనితీరు వంటివి స్థిరంగానే ఉన్నట్లు ప్రకటించింది. ఆయనను ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని చెప్పింది. కాగా, ప్రణబ్‌కు కరోనా సోకడంతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు వైద్యులు సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు ఇటీవలే ఆర్మీ ఆసుపత్రి తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/