ప్రారంభమైన ప్రజాదర్బార్..భారీగా తరలి వచ్చిన ప్రజలు
హైదరాబాద్: జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్లో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సీఎం క్యాంప్ ఆఫీస్కు తరలివచ్చారు. అధికారులు వారి పేర్లు నమోదుచేసుకుని ప్రజా భవన్లోకి అనుమతిస్తున్నారు. ప్రజలను నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అర్జీలను స్వీకరిస్తున్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో విద్యుత్పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణంపై సంస్థ ఎండీ సజ్జన్నార్తో చర్చించనున్నారు.