కేటీఆర్, హరీష్ రావులను కలిసిన పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ..శుక్రవారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు శ్రీనివాస్ పుట్టిన రోజు..ఈ సందర్బంగా వారిని కలిశారు. ఈ క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే ఇతర నాయకులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మధ్యనే పొంగులేటి శ్రీనివాస్ తన కుమార్తె వివాహ రిసెప్షన్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్..తన కాలుకు గాయమైనప్పటికీ కర్రసాయంతో హాజరయ్యారు. అంతకు ముందు బుధవారం ఖమ్మంలో వివాహ రిసెప్షన్ ఘనంగా జరిపారు. ఈ వేడుకకు లక్షలాది మంది హాజరయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ విందుకు హాజరయ్యారు. వైఎస్ షర్మిల, ఈటల రాజేందర్, వివేక్ తదితరులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.