సినీనటి కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు..

సీని నటి ఖుష్బు పై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీకి చెందిన ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ సాదిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే అమిత్‌షాను ఉద్దేశించి సాదిక్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కమలం నాథులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇక తన మీద చేసిన ఘాటు వ్యాఖ్యలపై సినీనటి, బిజెపి నేత కుష్బూ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెపద్యంలో మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఒక సాటి మహిళగా బహిరంగ క్షమాపణలు చెబుతున్నామని డిఎంకె సీనియర్ నేత స్టాలిన్ సోదరి కనిమొలి అన్నారు. స్టాలిన్ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడారని ఆమె అన్నారు. ఇక ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో సాదిక్ కూడా క్షమాపణలు కోరారు. తాను ఏ నేతను బాధ పెట్టాలని ఉద్దేశంతో అలా అనలేదని ఆయన అన్నారు.