ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో మొదలైన పోలింగ్

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

Polling in UP- Punjab
Polling in UP- Punjab

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర​ప్రదేశ్‌లో మూడో దశ,​ పంజాబ్​ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది . ఉత్తర ​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈసారి మొత్తం 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/