ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు : పోలిసుల రిమాండ్ రిపోర్ట్

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అర్వింద్ ఇంటిపై దాడి జరిగిందని తేల్చారు. మ్మెల్సీ కవిత పై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రెస్‌మీట్‌లు పెట్టి… ఆ ప్రెస్‌మీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారని.. అందుకు నిరసనగానే దాడి జరిగిందని పేర్కొన్నారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఉన్నారన్నారు. అర్వింద్ ఇంటి వద్ద బందోబస్త్ ఎక్కువగా లేకపోవడంతో నిందితులు దాడికి తెగబడ్డట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది.

ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్ళు, 2 కర్రలు, టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పూజ సామగ్రి, హాల్, కారుపై దాడి చేశారని రిపోర్టులో ఉంది. అయితే రిమాండ్ రిపోర్టులో జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్, జాగృతి నవీనాచారి పేర్లు లేవు. నిందితులకు పోలీసుల 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.