ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గుర్తింపు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇందుకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు.

కొంతకాలంగా కువైట్ లో ఉంటున్న మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం 14 ఏళ్లు కిందట దుబాయ్ కి వెళ్లి అక్కడి నుంచి కువైట్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక మమ్మద్ ఖాసిం కోసం ఎల్ఓసి నీ జారీచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఖాసింను పట్టుకున్నట్లు తెలిపారు.