రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని మోడీ సోదరుడి ఫ్యామిలీ

ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. వీరి ప్రయాణిస్తున్న కార్ కర్ణాటకలోని మైసూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ జోషీ, ఆయన కుమారుడు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ప్రహ్లాద్ మోదీ, ఆయన కొడుకు, కోడలు, మనవడు ఉన్నట్టు సమాచారం. వీరంతా మైసూరు నుంచి చామరాజనగర, బందీపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన గురించి సమాచారం అందుకున్న మైసూర్ ఎస్పీ సీమా లట్కర్ సహా అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందజేశారు. ఘటనలో గాయపడిన ప్రహ్లాద్ మోదీ, ఆయన కుమారుడు, కోడల్ని చికిత్స కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రహ్లాద్ మోదీకి ముఖంపై, మనవడు మెహత్‌కు కాలికి గాయమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. ప్రథమ చికిత్స అనంతరం మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయితే, స్వల్పగాయాలు కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని చికిత్స చేస్తున్న జేఎస్ఎస్ హాస్పటల్ వర్గం తెలిపింది.