హరిహర వీరమల్లు మూవీ అప్డేట్స్ పంచుకున్న నిర్మాత రత్నం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ క్రమంలో నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా తాలూకా క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు.
‘‘హరిహర వీరమల్లు మూవీ ప్రాపర్ పాన్ ఇండియా మూవీ. సౌత్ ఇండియా ప్రేక్షకులకి ఈ సినిమా ఎలా నచ్చుతుందో అంతకు మించి నార్త్ ఇండియన్స్కి నచ్చుతుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ని ఫినిష్ చేశాడు. సీన్ చాలా బాగా వచ్చింది’’ అని ఏఎం రత్నం చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీత అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. పవన్ కళ్యాణ్కి కెరీర్లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.