నేడు శ్రీరంగం, రామేశ్వ‌రంలో ప్ర‌ధాని మోడీ పర్యటన

PM Modi to offer prayers at famous Srirangam, Rameshwaram temple today

తిరుచిరాప‌ల్లి : ఈరోజు త‌మిళ‌నాడులో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. తిరుచిరాప‌ల్లిలోని శ్రీ రంగ‌నాథ స్వామి ఆయ‌లంలో ఆయ‌న పూజ‌లు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న రామేశ్వ‌రం చేరుకుంటారు. అక్క‌డ కూడా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లో పాల్గొననున్నారు. శ్రీరంగం స్కాల‌ర్స్ పాడ‌నున్న కంబ రామాయణం భ‌జ‌న‌ల‌ను ఆయ‌న ఆల‌కించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం రామేశ్వ‌రం చేరుకుంటా. ద‌ర్శ‌న‌, అభిషేక పూజ‌లో ఆయ‌న పాల్గొంటారు. ప్ర‌ధాని మోడీ రాక సంద‌ర్భంగా శ్రీరంగం ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్య‌లో రామాల‌యం ఓపెనింగ్ సంద‌ర్భంగా.. ప్ర‌ధాని మోడీ ప‌లు రాష్ట్రాల్లో ఉన్న ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు.