శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

pm-modi-offers-prayers-at-sri-ranganathaswamy-temple-in-tiruchirappalli

న్యూఢిల్లీ ః నేడు ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకంటే ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలో ఉన్న గజరాజు ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రధానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆ త‌ర్వాత ప్రధాని రామేశ్వరం బయలుదేరారు. అక్కడ కూడా ప్రత్యేక పూజ‌లు చేయనున్నారు. కాగా, ప్రధాని మోడీ రాక సంద‌ర్భంగా శ్రీరంగం ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు.

కాగా, జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్యలో రామాల‌యం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోడీ ప‌లు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రధాని పూజలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.