రామాలయ అభివృద్ధి పనులపై ప్రధాని మోడి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని మోడి అయోధ్యలో చేపడుతున్న రామాలయ అభివృద్ధి పనులనుసమీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మోదీ వర్చువల్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ఇటీవల భేటీలో పాల్గొనడం ఈనెలలో రెండవసారి. అయోధ్య అభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను యోగి వివరించారు. రోడ్ల నిర్మాణం, మౌళిక సదుపాయాలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణాల కోసం వేసిన ప్రణాళికలను సీఎం యోగి తెలియజెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/