రాహుల్ గాంధీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
కొండగట్టు సందర్శన వాయిదా.. నిజామాబాద్లో పాదయాత్ర రద్దు
హైదరాబాద్ః రాహుల్ గాంధీ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొండగట్టు సందర్శన వాయిదా పడిపోయింది. రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కుదించారు. దీంతో కరీంనగర్ నుంచి జగిత్యాలకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అక్కడే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
కోరుట్ల కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న రాహుల్.. లంచ్.. తర్వాత నేరుగా ఆర్మూర్కి వెళతారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 2.30కి సభ జరుగనుండగా..ఆ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్కి ఆ తర్వాత ఢిల్లీకి రాహుల్ గాంధీ వెళతారు.
కాగా, ఉదయం షెడ్యూల్ ప్రకారం.. కరీంనగర్లోని వీపార్క్ హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారు. చొప్పదండి నియోజకవర్గం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాలలో కార్నర్ మీటింగ్, మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలో సమావేశం, 1 గంటకు వేములవాడలో కార్యక్రమాలతో రాహుల్ బిజీగా గడపనున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం కార్నర్ మీటింగ్ తర్వాత భోజనం చేస్తారు. కాగా రాహుల్ పర్యటన నిమిత్తం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేశాయి. రాహుల్ సభల్లో జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జనసమీకరణపై నేతలు దృష్టిసారించారు.