స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన అయోధ్య బాలరాముడు ఫోటోలు
అయోధ్యః కౌసల్య రాముడు.. అయోధ్య లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్మించారు. సుమారు 84 సెకన్ల పాటు అసలు క్రతువును నిర్వహించారు. కీలకమైన ఈ 84 సెకన్ల సమయంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ట చేశారు. రాముడి విగ్రహం కండ్లకు ఉన్న వస్త్రాన్ని ప్రధాని తొలగించారు. ఆ తర్వాత పుష్పాలతో రామున్ని పూజించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో 50 శంఖాలు ఊదారు. గర్భిగుడి పూజలు ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.