బాలకృష్ణ – పవన్ లపై పేర్ని నాని సెటైర్లు

వైస్సార్సీపీ నేతల కళ్లు నిత్యం పవన్ కళ్యాణ్ కలయికలపైనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏంచేస్తున్నాడు..? ఎక్కడికి వెళ్తున్నాడు..? ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు..? ఇలా అన్నింటిపై ఎప్పటికప్పుడు అరా తీస్తూ..వాటిపై కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్..బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు వెళ్లడం జరిగింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.

విజయవాడలో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కార్యక్రమంపై.. మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..’బావతో తిరిగిన పవన్.. బామ్మర్దితో వెళ్తే.. తప్పేం ఉంది. అది కూడా డబ్బులు తీసుకొని చేసే షో. దానికి ముందే స్క్రిప్ట్ రాసిస్తారు. ప్రజలను ఎంటర్‌టైన్ చేయడానికి డబ్బులు తీసుకొని కాసేపు అలా మాట్లాడతారు. అల్లు అరవింద్ పుణ్యమా అని బాలకృష్ణకు మరో అవకాశం ఉంది. అన్ స్టాపబుల్ వేదికగా ఎన్టీఆర్ మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన బావ చేసిన తప్పులను బాలకృష్ణ కప్పిపుచ్చుతున్నారు’ అని పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

అలాగే కమ్యూనిస్టు పార్టీ నేతల ఫై కూడా పలు వ్యాఖ్యలు చేసారు. 31 లక్షల మందికి జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అప్పుడు ఈ కుహనా కమ్యూనిస్టులు ఒక్క రోజైనా జగన్ అభినందించారా. ఎందుకు నోరు రాలేదు. అమరావతిలో 50 వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తుంటే.. వద్దని అడ్డుకున్న వారికి మద్దతుగా నిలిచినవారు కమ్యూనిస్టులా.. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకుంటారా.. ఇది చంద్రబాబుకు అమ్ముడుపోయిన పార్టీ. ఇద్దరు నేతలు కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగ ఉంటే దాన్ని కమ్యూనిస్టు పార్టీ అంటారా’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

‘చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా సీపీఐ రామకృష్ణ, నారాయణ పని చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారు. కమ్యూనిస్టుల్లో కమ్యూనిజం ఉందా. నిజమైన కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాడతారు. కానీ.. వీరు మాత్రం చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని మండిపడ్డారు.