న‌గ‌రంలో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం : మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రి మహమూద్ అలీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజ‌లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రోడ్లు, సీవరేజ్, ఫ్లై ఓవర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులుల లేకుండా చేస్తామన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/