జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదం ఫై పవన్ దిగ్బ్రాంతి

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం పట్ల జనసేన నేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

బస్సు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసిందని..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ప్రమాదం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు.. అశ్వారావు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా.. ఒక్కసారిగా జల్లేరు వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. బస్సులో మొత్తం 50 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ చెన్నారావు స్పాట్ లోనే చనిపోయారని కండక్టర్ రవి చెప్పారు. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.