పరువు నష్టం కేసులో మరోసారి రాహుల్ గాంధీకి సమన్లు

patna-court-summons-rahul-gandhi

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. మోడీ ఇంటి పేరును ఉద్దేశించి చేసి ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ దాఖలైన పరువునష్టం కేసులో తాజాగా బిహార్ లోని పాట్నా కోర్టు సమన్లు పంపింది. ఏప్రిల్ 25న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాజ్యసభ ఎంపీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పాట్నాలోని కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఏప్రిల్ 12న గాంధీని కోర్టు ఎదుట హాజరుకావాలని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన రాహుల్​ తరఫు న్యాయవాదులు.. ప్రస్తుతం రాహుల్​ గాంధీ సూరత్​ కోర్టు కేసులో బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ కారణంగా కేసును మరో తేదీన విచారించాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన జడ్జి.. కేసును ఏప్రిల్​ 25కు వాయిదా వేశారు.

ప్రాసిక్యూషన్ లాయర్ ప్రియా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారు తరపు వాంగ్మూలాలు నమోదు చేశామని, అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఇప్పుడు రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఆ తరువాత ఆయనపై లోక్‌సభ నుండి ఎంపీగా అనర్హత వేటు పడింది.