దేశవ్యాప్తంగా నేడూ, రేపు బ్యాంకుల సమ్మె

Bankers Strike-

New Delhi: దేశవ్యాప్తంగా నేడూ, రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. 
ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్​ బ్యాంక్​ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ఇది వరకే వెల్లడించింది.ఈ రెండు రోజుల సమ్మె తర్వాత తమ డిమాండ్లను అంగీకరించకుంటే మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్​బీయూ తెలిపింది. 
ఆ తర్వాత ఏప్రిల్​ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
ఐబీయూతో జరిగిన చర్చలో వేతనాలు​ 15 శాతం పెంచాలని యూఎఫ్​బీయూ కోరింది. 
ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంపునకు మాత్రమే సుముఖత చూపించిందని సమాచారం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/