ఏపీలో ఈరోజు ఒక్క రోజే 10 ఓమిక్రాన్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక్క రోజే 10 ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం తో ప్రభుత్వం ఆందోళనలో పడింది. మొన్నటి వరకు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 06 కేసులు మాత్రమే ఉండడం తో ప్రభుత్వం తో పాటు ప్రజలు కాస్త కూల్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక్క రోజే ఓమిక్రాన్ కేసులు భారీగా బయటపడడం తో అంత భయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 16కు చేరింది.

ప్రస్తుతం నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికే సోకాయి. అయితే వీరితో పాటు సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులకు ఓమిక్రాన్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నమోదైన కేసుల్లో ఈస్ట్ గోదావరిలో 3, అనంతపూర్ లో 2, కర్నూలు 2, వెస్ట్ గోదావరి లో 1, గుంటూర్ 1, చిత్తూర్ లో 1 చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్, నైజీరియా, దుబాయ్, సౌదీ నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ సోకింది.