సోము వీర్రాజు క్వార్టర్ మందు ఫై కేటీఆర్ సెటైర్లు

బిజెపి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం..ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఎవరైనా అధికారంలోకి వస్తే మద్యాన్ని బంద్ చేయిస్తాం అని చెపుతారు కానీ నాణ్యమైన ఆల్కహాల్ ఇష్టం…క్వార్టర్ సీసాను రూ.50కే ఇస్తామని చెప్పడం ఒక్క సోము వీర్రాజుకే చెల్లిందని కామెంట్స్ వేస్తున్నారు.

సోము వీర్రాజు ఆఫర్ ఫై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం సెటైర్లు వేశారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేసిన కేటీఆర్.. ‘వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్‌, ఇంకా కుదిరితే రూ.50లకే ఇస్తాం అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు కేటీఆర్ చేసిన ట్వీట్లో విన‌వ‌చ్చు.

Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low

National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu— KTR (@KTRTRS) December 29, 2021

ఈ వ్యాఖ్యలపై నేడు ప్రెస్‌మీట్‌లో సోమువీర్రాజు స్పందించారు. తాను మద్యం రేట్లు తగ్గిస్తానని చెప్పింది.. పేదల కోసం అని చెప్పారు. కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో తిరిగి ఇస్తారని అన్నానని చెప్పారు. ఆడపడుచుల కోసమే మద్యం రేట్లు తగ్గిస్తామన్నారు. వారి బలహీనతలను వైఎస్సార్సీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. క్వార్టర్ రూ.250కి అమ్మి పేదల రక్తం తాగుతున్నారని విమర్శించారు.