తిరుమల ఆలయానికి అక్టోపస్ టీమ్స్ పహారా..
తిరుమలలో శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్ సమీపంలో ఆక్టోపస్ క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్) ను భద్రతగా పెట్టబోతోంది. బుధవారం శ్రీవారి ఆలయం ఆలయ భద్రత ఏర్పాట్లను డీఐజీ పరిశీలించారు. ఆలయ ప్రవేశమార్గం దగ్గర ఏర్పాటు చేసే ఛాంబర్లో ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ఆక్టోపస్ టీమ్ ను ఉంచారు.
ఆక్టోపస్ టీమ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ చాంబర్ ఏర్పాటు చేశారు. బుల్లెట్ప్రూఫ్ జాకెట్స్, డే-విజన్ గ్లాసెస్, అత్యాధునిక ఆయుధాలతో అక్టోపస్ బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఆలయ ముఖద్వారం దగ్గర నిరంతర నిఘా ఉంటుంది. టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కట్టడిలో ఆక్టోపస్ ఆరితేరింది. ఎలాంటిదాడినైనా మెరుపువేగంతో తిప్పికొట్టడంలో వీరు నిష్ణాతులు.
గ్లోక్-19, కోల్ట్9mm, ఫ్రాంచి స్పాస్-15, డ్యూల్మోడ్ షాట్గన్స్, స్నైపర్ రైఫిల్స్, టేజర్గన్స్, కార్నర్ షాట్స్ సిస్టం లాంటి అధునాత ఆయుధాలను అలవోకగా వాడగల సత్తా ఆక్టోపస్ టీమ్కు ఉంది. తిరుమల ఆలయ భద్రత, ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీపై ఇటీవలే సెంట్రల్ ఇంటిలిజెన్స్ సమీక్ష నిర్వహించింది. ఆ సమీక్ష తర్వాత ఆక్టోపస్ టీమ్ను శ్రీవారి ఆలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చెయ్యబోతోంది.