జోరుగా ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి అన్నారు. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. సీనీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రిస్తున్నారు.

ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు అమ్ముడయ్యాయి. భారత్ లో ఇంతవరకు ఇదే రికార్డు అని హైదరాబాద్ మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. గతంలో ఈ రికార్డు 12 వేల అమ్మకాలు కాగా… ఇప్పుడు అంతకు రెండింతల అమ్మకాలతో ఎన్టీఆర్ స్మారక నాణేలు రికార్డు నెలకొల్పాయని వివరించారు.