బసవతారకం హాస్పటల్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను హైదరాబాద్ లోని బసవతారకం హాస్పటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ.. ఈ సందర్బంగా వైద్య రంగంలో విశేష సేవలందించిన డా. సోమరాజు, కార్డియాలజిస్ట్ నాగేశ్వరరావు, డీఎన్ కుమార్ కార్డియాలజిస్ట్, బీఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్ లను సన్మానించారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ప్రజా జీవితంలోకి వచ్చి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని , భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలచారని కొనియాడారు.