సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ..వైసీపీ నేతలను సినిమాలో విలన్లతో పోల్చారు. సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై ఆయన చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేశారు.
రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే తన చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సూర్యకిరణ్ కు మద్దతుగా 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు. తన అనుచరుల బిల్లులు చేయలేదని పోలవరం ఏఈ సూర్యకిరణ్ ని వైసిపి రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టడం దారుణమన్నారు. మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజనీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చెయ్యకపోవడం విచారకరం. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడిని ఖండించకపోవడం అన్యాయమే. ఏఈ సూర్య కిరణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. బాధితుడు ఏఈ సూర్య కిరణ్ కి న్యాయం చెయ్యాలి.అని డిమాండ్ చేశారు నారా లోకేష్.