గొప్ప మనసు చాటుకున్న నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన గొప్ప మనసు చాటుకున్నారు. గోదావరి ముంపు మండలాలకు 4 టన్నులు బియ్యం.. రెండు టన్నుల కూరగాయలను పంపిణి చేశారు. అంతే కాదు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమకు తోచిన సాయం చేస్తేనే వరద బాధితులు తొందరగా కోలుకుంటారు. కాబట్టి మన వంతుగా వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిద్దాం. ఇప్పటికే తమ వంతుగా సాయం చేసిన వారిని అభినందిద్దాం అని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాల ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల్లో గోదావరి వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఈ మండలాల్లోని ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద బాధితులను ఆదుకుంటామని సీఎం జగన్ హామీ ఇవ్వగా.. తమ వంతు సాయం చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నింటిని కలిపి పోలవరం జిల్లా చేస్తామని ప్రకటించారు.

ముంపు ప్రభావిత ప్రాంత ప్రజల దుస్థితిని చూసి చంద్రబాబు చలించిపోయారు. వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో నారా లోకేశ్.. తన వంతు సాయంగా.. మంగళగిరి నియోజకవర్గం నుంచి 4 టన్నులు బియ్యం.. రెండు టన్నుల కూరగాయలను విలీన మండలాలకు పంపించారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన నారా లోకేశ్.. దాతలు, టీడీపీ నేతలు స్పందించాలని.. వరద పీడితులకు సాయం అందించాలని కోరారు.