చంద్రబాబుకి పూర్తిగా మతిభ్రమించిందిః వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

nallapareddy-prasanna-kumar-fires-on-chandrababu

అమరావతిః చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . నెల్లూరు జిల్లా…విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడారు. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు…పవన్ కళ్యాణ్ లు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు…చంద్రబాబుకి పూర్తిగా మతిభ్రమించిందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహించారు.

చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి…ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి పొత్తులు పెట్టుకొనేతత్వం చంద్రబాబుదన్నారు.వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న చంద్రబాబు నైజం దేశానికి తెలుసు అన్నారు. జగన్ పై చంద్రబాబు విమర్శలు సరికావు…జూబ్లీహిల్స్ నక్కవని..కుప్పం కుక్క వని భారతదేశంలో మాఫియా గ్యాంగ్ లీడర్.. అని రాజకీయ వ్యభిచారి అని నేను కూడా తిట్టొచ్చ అని చురకలు అంటించారు. కానీ మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అడ్డు వస్తోంది….చంద్రబాబు సంస్కారం నేర్చుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు.