మరోసారి ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్ ఐడీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని.. లేదంటే కాల్చి చంపేస్తామని ఆ మెయిల్లో పేర్కొన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.