మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్

PM Modi departs for Germany as part of his 3-day Europe visit

రేపు గురువారం హైద్రాబాద్లో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా మోడీ టూర్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు. రేపు (గురువారం) మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో మోడీ బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గాన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి చేరుకుంటారు.

మధ్యాహ్నం 2నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 3.55 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఐఎస్‌బీతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్‌ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే మోడీ పర్యటన నిమిత్తం హైదరాబాద్ లో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.