బిఆర్ఎస్కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్ః అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీకి షాక్! నాగర్ కర్నూలు జిల్లా నాయకుడు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31వ తేదీన కొల్లాపూర్లో జరగనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరనున్నారు.
31న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
గురువారం ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్లో తనకు అన్ని విధాలుగా సహకరించారని, కానీ స్థానిక సమస్యలను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు కెసిఆర్కు పంపించారు.