ఆ మహనీయుడికి మా నమస్సుమాంజలిః ఎమ్మెల్సీ క‌విత‌

125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌రించుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం…

mlc-kavitha-pay-tributes-to-dr-br-ambedkar-birth-anniversary

హైదరాబాద్‌ః డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 132వ జ‌యంతి సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఆధునిక భారతానికి మార్గదర్శి, ప్రపంచంలోనే గొప్పదైన భారత రాజ్యాంగ రూపకర్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి జీవితాంతం కృషి చేసిన డాక్ట‌ర్ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా నమస్సుమాంజలి అని క‌విత పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు.. విద్య, వైద్యం, ఉపాధితో పాటు సామాజికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు అనేక మహోన్నత కార్యక్రమాలు అమలవుతున్నాయి. హైదరాబాద్‌లో దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం నేడు ఆవిష్కరించుకోవడం చారిత్రాత్మకం, గర్వకారణం అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.