బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి గుడ్‌బై..కాంగ్రెస్ లోకి ఎంట్రీ

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి, ముఖ్యంగా గులాబీ బాస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ షాకులు మొదలయ్యాయి. అప్పటివరకు టికెట్ కోసం ఎదురుచూసిన వారికీ టికెట్ ఇవ్వకపోవడం తో వారంతా బయటకు వస్తూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరగా…తాజాగా బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత అయిన కసిరెడ్డి బీఆర్ఎస్‌కు బైబై చెప్పాడు. రెండు రోజుల్లో ఈయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకర్తి నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.