రాజీనామా ఆమోదం పొందితే టీచర్ పోస్టులో చేరిపోతానన్న అంటున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ శ్రేణులు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన JACకి విశాఖలో శనివారం రాజీనామా లేఖను అందజేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్‌పై నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇలా ఎంపికైన వారిలో ధర్మశ్రీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్హత పత్రాలను సమర్పించారా? అన్న విలేకరుల ప్రశ్నకు ధర్మశ్రీ స్పందిస్తూ.. విద్యార్హతకు సంబంధించి ధ్రువపత్రాలను పంపాలని కోరడంతో తాను పంపానని, తన రాజీనామా ఆమోదం పొందితే కనుక చోడవరం, దాని సమీపంలోని పీఎస్‌పేటలో ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతానని నవ్వుతూ తెలిపారు.